ఘనంగా వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

59చూసినవారు
గురజాల పట్నంలో ప్రధాన రహదారిలోని వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద సోమవారం మండల వైసీపీ ఆధ్వర్యంలో రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.మండలంలోని వైసీపీ నాయకులు,కార్యకర్తలు రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.జోహార్ వైయస్సార్... జోహార్ వైయస్సార్.అంటూ వైసీపీ శ్రేణులుపెద్దఎత్తున నినాదాలు చేశారు. వైసిపి నాయకులు కేక్ కటింగ్ చేసి అక్కడికి వచ్చిన వారందరికీ పంచిపెట్టారు.

సంబంధిత పోస్ట్