వర్షపు నీటితో ప్రవహిస్తున్న ఉంగుటూరు వాగు

54చూసినవారు
పల్నాడు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరు వాగు వర్షపు నీటితో ప్రవహిస్తుంది. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షం కారణంగా పైనుంచి నీరు అధికంగా రావడంతో ఉంగుటూరు వద్ద ఉన్న లో లెవెల్ చప్టా వద్ద శనివారం వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఉంగుటూరు గ్రామానికి వెళ్లేందుకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు ఎవరూ కూడా వాగులు దాటేందుకు ప్రయత్నం చేయరాదని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్