నేడు వీఐటీకి గవర్నర్ రాక

51చూసినవారు
నేడు వీఐటీకి గవర్నర్ రాక
తుళ్లూరు మండలం ఐనవోలులోని వీఐటీ- ఏపీ యూనివర్సిటీలో 4వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు యాజమాన్యం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, గౌరవ అతిథిగా హైదరాబాద్ కు చెందిన బోష్ గ్లోబల్ సాఫ్ట్ వేర్ టెక్నాలజీస్ సెంటర్ హెడ్ అంజాద్ ఖాన్ పఠాన్ పాల్గొంటారని పేర్కొంది.

సంబంధిత పోస్ట్