కడప నుంచి బరిలో షర్మిల

1059చూసినవారు
కడప నుంచి బరిలో షర్మిల
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్‌సభ బరిలో దిగడం దాదాపు ఖాయమైంది. వైసీపీ సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఆమె ఢీకొట్టనున్నారు. అసెంబ్లీ, పార్లమెంటుకు కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో షర్మిల పేరు కూడా చేర్చినట్లు తెలుస్తోంది. ఈ జాబితాను ఏఐసీసీ కేంద్ర ఎన్నికల స్క్రీనింగ్ కమిటీకి షర్మిల పంపించారు. మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ రాష్ట్ర అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్