నా భర్త పక్కలోకి రావట్లే.. యూనియన్ లీడర్ కోడలు ఆందోళన

64చూసినవారు
నా భర్త పక్కలోకి రావట్లే.. యూనియన్ లీడర్ కోడలు ఆందోళన
తనకు న్యాయం చేయాలని టీఎస్ ఆర్టీసీ యూనియన్ నాయకుడు రాజిరెడ్డి కోడలు పావని శనివారం ఎల్బీనగర్‌లోని తన అత్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఆమె మాట్లాడుతూ.. 'సీఎం రేవంత్ రెడ్డి భార్యభర్తలను కాపురం చేసుకోవద్దని చెబుతారా? పెళ్లైన మూడోరోజు నుంచి నా భర్త నా పక్కలోకి రావడం లేదు. దీనిపై ప్రశ్నిస్తే రాజకీయ నాయకుల పేర్లు చెప్పి బెదిరిస్తున్నారు' అని వాపోయింది. రాజిరెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డితో పావనికి 2023 మే 21న వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందు పావనికి సోరియాసిన్ ప్రాబ్లం ఉందని, ఆ విషయం దాచి పెళ్లి చేసుకుని మోసం చేసిందని రాజిరెడ్డి చెబుతున్నారు. ఈ విషయంపై కోర్టులో కేసు నడుస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్