కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఇవాళ ఢిల్లీలో మహార్యాలీ నిర్వహించనుంది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్లకు సంఘీభావంగా రామ్లీలా మైదానంలో ఈ ర్యాలీ జరగనుంది. ఇందులో ఇండియా కూటమి ముఖ్య నేతలు పాల్గొననున్నారు. అలాగే 20,000 మందికి పైగా ప్రజలు కూడా ఈ మహార్యాలీలో పాల్గొంటారని ఆప్ సీనియర్ నేత గోపాయల్ రాయ్ తెలిపారు.