వైఎస్ జగన్‌పై బుద్దా వెంకన్న ఫైర్

57చూసినవారు
వైఎస్ జగన్‌పై బుద్దా వెంకన్న ఫైర్
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. మంగళవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. వరదల సమయంలో సీఎం చంద్రబాబు ప్రజలను ఆదుకున్న తీరు దేశానికే ఆదర్శమన్నారు. ఇంటింటికీ ఆహారం, మంచినీరు అందించారన్నారు. ఇలాంటి పనులు చూసి వైసీపీ నేతలు ఓర్వలేపోయారని, వరదలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేశారని అనడం సిగ్గుచేటన్నారు. వరదల్లో ప్రజలు అల్లాడిపోతే జగన్ ఏసీ గదిలో కూర్చొని కామెంట్లు చేశారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్