టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ నేడు నెల్లూరు, పత్తికొండలో పర్యటించనున్నారు. 'రా.. కదలిరా' బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. ముందుగా ఉరవకొండ నుంచి హెలికాప్టర్లో నెల్లూరుకు చంద్రబాబు చేరుకోనున్నారు. అక్కడ సభ ముగిశాక కర్నూలు జిల్లాలోని పత్తికొండకు హెలికాప్టర్లో వెళ్లనున్నారు. బహిరంగ సభ అనంతరం పత్తికొండలోనే చంద్రబాబు బస చేస్తారని
టీడీపీ వర్గాలు తెలిపాయి.