పాలసముద్రం గ్రామంలో అతిసారం అదుపులో ఉందని వైద్యాధికారి మురళీకృష్ణ గురువారం తెలిపారు. గ్రామంలో జాతర అంబలి తాగిన వారు ఆసుపత్రి పాలయ్యారని చెప్పారు. గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. రోగుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షలకు పంపామన్నారు. వ్యాధి నియంత్రణలోనే ఉందని. దీనిపై స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.