శ్రీ చైతన్య పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

84చూసినవారు
శ్రీ చైతన్య పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం శ్రీ చైతన్య పాఠశాలలో నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్21) ఏజీఎం సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ప్రధానోపాధ్యాయుడు గోపి మాట్లాడుతూ మానవ దైనందిన జీవితంలో ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించడానికి, ఆరోగ్యవంతుడిగా జీవించడానికి యోగాసనాలు ప్రతి ఒక్క విద్యార్థి అలవర్చుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో యోగోపాధ్యాయులు విద్యార్థుల చేత యోగాసనాలు చేయించారు.