కాణిపాకం ఆలయంలో భక్తుల రద్దీ

85చూసినవారు
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వరుస సెలవు దినాలు రావడంతో వేలాదిగా భక్తులు ఆలయానికి పోటెత్తారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో క్యూలన్ని నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశు, చైర్మన్ మోహన్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.