బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

3296చూసినవారు
పాకాల మండలం నేండ్రగుంట వద్ద గాదంకి కి చెందిన మోహన్ (48) సోమవారం రాత్రి రోడ్డు దాటుతుండగా బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో 108 ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా ఎడమ కాలు విరిగిందన్నారు. ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్య సేవల కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పాకాల పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్