ఆత్మహత్యకు యత్నించిన రైతు మృతి

2238చూసినవారు
ఆత్మహత్యకు యత్నించిన రైతు మృతి
ఆత్మహత్యకు యత్నించిన రైతు మృతి చెందినట్లు మదనపల్లె సీఐ శేఖర్ తెలిపారు. అంకిశెట్టిపల్లె పంచాయతీ, చెంబకూరురోడ్డు, రామాపురానికి చెందిన రైతు ఐ. శ్రీనివాసులు ఆర్థిక సమస్యలు అధికమై జీవితంపై విరక్తితో శనివారం ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా రైతు శ్రీనివాసులు తన పొలం వద్దకు వెళ్లి అక్కడే విషం తాగాడు. కుటుంబీకులు గమనించి వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్