చిప్పిలిలో... భర్త పై భార్య కర్రతో దాడి

54చూసినవారు
చిప్పిలిలో... భర్త పై భార్య కర్రతో దాడి
మదనపల్లె మండలంలోని చిప్పిలిలో భర్తపై భార్య కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు గురువారం మదనపల్లె ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. మండలంలోని చిప్పిలి గ్రామానికి చెందిన దంపతులు గంగులప్ప, రవణమ్మలు కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. భర్తకు తెలియకుండా రవణమ్మ తన కుమార్తెను తమ్మునికి ఇచ్చి గుట్టుగా పెళ్లి చేసింది. విషయం తెలుసుకున్న గంగులప్ప భార్యను నిలదీయడంతో ఆమె రెచ్చిపోయి భర్తపై కర్రతో దాడి చేసి గాయపరిచింది.

సంబంధిత పోస్ట్