నగరి: కుంభాభిషేకంలో పాల్గొన్న మాజీ మంత్రి రోజా

64చూసినవారు
నగరి: కుంభాభిషేకంలో పాల్గొన్న మాజీ మంత్రి రోజా
చిత్తూరు జిల్లా, నగరి రూరల్ మండలంలోని దేశూరు అగరం గ్రామంలో శ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి నూతన ఆలయ అష్ట బంధన, విగ్రహ ప్రతిష్ట, మహా కుంభాభిషేక మహోత్సవంలో బుధవారం మాజీ మంత్రి రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ నిర్వాహకులు వేద పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్