వెనుకబాటు జీవనం సాగిస్తూన్న మన గిరిజన యానాదుల సంక్షేమం, అభివృద్ధికి మనమే పాటుపడదామని గిరిజన యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాపట్ల వెంకటపతి, పరమాల గోపి అన్నారు. ఆదివారం పీలేరులో ఏపి గిరిజన యానాది సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు, రాష్ట్ర గౌరవాధ్యక్షులు జానం గంగిరెడ్డి ఆధ్వర్యంలో గిరిజన యానాది మేల్కొలుపు సభ నిర్వహించి, అన్నమయ్య జిల్లా స్థాయి మహా కూటమిని ఏర్పరిచారు.