సారాతో సహా ద్విచక్ర వాహనం స్వాధీనం

1524చూసినవారు
పల్సర్ వాహనంతో సహా 40 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు పీలేరు ఎస్ఈబి సిఐ శ్యాం ప్రసాద్ తెలిపారు. మంగళవారం పీలేరు-కలికిరి రోడ్డులోని ఆరవాండ్లపల్లి వద్ద దాడులు చేయగా, వాల్మీకిపురం మండలం, మేకలవారిపల్లికి చెందిన పి. శేఖర్ పల్సర్ వాహనంలో సారా తరలిస్తూ, తమ సిబ్బందిని చూసి వాహనం వదిలి పరారయ్యాడన్నారు. త్వరలోనే నిందితుడిని అరెస్టు చేస్తామన్నారు. ఈ దాడిలో ఎస్సై లక్ష్మీనరసయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్