పెన్షన్ పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యంపై సోమవారం టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఆ పార్టీ సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో నారాయణవనం మండల కేంద్రంలో మౌన దీక్ష చేపట్టారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ నిలిపివేశారన్నారు. దీన్ని చంద్రబాబుపై రుద్దడం తగదన్నారు.