తిరుపతి ఎస్వీయూ క్యాంపస్ లో ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణల పై ఆదివారం సిట్ దర్యాప్తు చేస్తోంది. ఎస్వీయూ పీఎస్లో నమోదైన కేసులు, ఎఫ్ఐఆర్ ల వివరాలను పరిశీలించింది. అనంతరం పద్మావతి మహిళా వర్సిటీలో పులివర్తి నానిపై జరిగిన దాడి ఘటనపై విచారణ చేసింది. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.