AP: మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మంత్రుల అభీష్టాలు, వారి సమర్ధత మేరకు రేపటిలోగా శాఖలు కేటాయిస్తానని వెల్లడించారు. ఇచ్చిన శాఖకు పూర్తిస్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రులకు దిశానిర్దేశం చేశారు. తాను సీఎంగా ఉన్నప్పటి పరిస్థితి, ఇప్పటి పరిస్థితిని మంత్రులకు ఆయన వివరించారు.