మిచౌంగ్ బాధిత రైతులకు ఈ నెలలోనే పరిహారం: సీఎస్

85చూసినవారు
మిచౌంగ్ బాధిత రైతులకు ఈ నెలలోనే పరిహారం: సీఎస్
ఏపీలో మిచౌంగ్ తుపానుతో పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇతర పరిహారానికి నిధులు ఈ నెలలో విడుదలవుతాయని సీఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు త్వరలోనే నిధులు కేటాయిస్తామన్నారు. వేసవిలో గ్రామాలు, పట్టణాల్లో తాగు నీటికి ఇబ్బంది లేకుండా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :