AP: కూటమి నేతలు తనపై కుట్రలు చేస్తున్నారంటూ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఎన్నికలు సరిగ్గా జరుగుతాయన్న నమ్మకం లేదు. అమల్లో ఉన్న పథకాల డబ్బులు కూడా ప్రజలకు చేరకుండా ఆపుతున్నారు. ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చేస్తున్నారు. పేదలకు మంచి చేస్తున్న నన్ను లేకుండా చేయాలని కూటమి నేతలు కుతంత్రాలు పన్నుతున్నారు." అని మచిలీపట్నం సభలో సీఎం మండిపడ్డారు.