మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి తనపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వైసీపీ కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి తెలిపారు. హత్యానేరం, నేరపూరిత కుట్ర, సాక్షాధారాల ధ్వంసం వంటి ఆరోపణలతో సీబీఐ తనపై కేసులు పెట్టిందని వివరించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో తాను ఏ8గా ఉన్నానని ప్రస్తావించారు. కాగా, శుక్రవారం కడప వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.