చెన్నై నుంచి విశాఖ మీదుగా సింగపూర్ క్రూయిజ్ సేవలు మార్చి నెలలో ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం లిట్టోరల్ క్రూయిజ్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో విశాఖ నుంచి థాయ్లాండ్, మలేషియా, శ్రీలంక, మాల్దీవులకు కూడా క్రూయిజ్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. క్రూయిజ్ సేవల ప్రారంభంతో ప్రపంచ పర్యాటకంలో విశాఖకు ప్రత్యేక గుర్తింపు దక్కనుంది.