యూట్యూబ్, ఓటీటీలలో వివేకం సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని కోరుతూ వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. తాను సీబీఐకి, పులివెందుల కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ సినిమా తీశారని, ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు చిత్ర ప్రదర్శనను నిలిపేయాలని కోరారు. ఈ పీటీషన్ పై నేడు విచారణ జరగనుంది.