టీడీపీ పొత్తుపై ఏపీ బీజేపీలో తీవ్ర అసంతృప్తి

572చూసినవారు
టీడీపీ పొత్తుపై ఏపీ బీజేపీలో తీవ్ర అసంతృప్తి
టీడీపీ కోసం రాష్ట్ర బీజేపీ నేతలను తాకట్టు పెట్టారని ఆ పార్టీ ఏపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన సామాజిక వర్గం కోసం ఏపీ బీజేపీని పురందేశ్వరి తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో లేనప్పుడే 14 ఎమ్మెల్యే సీట్లు తీసుకున్నామని, ఇప్పుడు ముష్టి 6 అసెంబ్లీ సీట్లకు లొంగిపోయారని మండిపడ్డారు. పురందేశ్వరి ఏపీ బీజేపీ నేతల భవిష్యత్‌ను కాపాడలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె చెబితే వినే వారు పార్టీలో లేరని ఏపీ బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్