AP: కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు దారి మళ్లాయని బీజేపీ నేత పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యంపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా చూపి అప్పులు చేశారన్నారు. గవర్నర్ నజీర్ను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు కోరామని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టి తెచ్చిన అప్పుల వివరాలు అడిగినట్లు చెప్పారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు తెచ్చిందని ధ్వజమెత్తారు.