కరెంటు ఛార్జీలు, మద్య నిషేధంపై జవాబు చెప్పిన తర్వాతే సీఎం జగన్ ఓట్లు అడగాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. "బటన్ నొక్కి ప్రజలకు ఇచ్చింది ఎంత.. జగన్ తిన్నదెంత? నిత్యావసరాలు, పెట్రోల్ ధరలు ఎందుకు పెంచారో చెప్పాలి? అప్పు తెచ్చి బటన్ నొక్కడం జగన్ పని.. సంపద సృష్టించి పేదలకు పంచడం నా పని. రేపటి కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం గెలవాలి. కూటమి అభ్యర్థులను గెలిపించాలి." అని చీపురుపల్లి సభలో చంద్రబాబు పిలుపునిచ్చారు.