YS జగన్‌ను బీజేపీ వాడుకుని వదిలేసిందా?

77చూసినవారు
YS జగన్‌ను బీజేపీ వాడుకుని వదిలేసిందా?
శాశ్వత మిత్రులు, శత్రువులు లేనిదే రాజకీయం. 2014లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. 2019లో పొత్తుకు నో చెప్పి వైసీపీకి సపోర్ట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో తన బిల్లులు పాస్ కావడానికి వైసీపీని వాడుకుందని ప్రచారం. తీరా ఎన్నికలు సమయానికి టీడీపీతో పొత్తు అని కుండబద్ధలు కొట్టింది. ఒకవేళ టీడీపీకి బీజేపీకి చెడితే వైసీపీకి సపోర్ట్ ఇచ్చే ఆలోచనే లేకుండా మధ్యలో పవన్ వచ్చారు. రాజకీయాల్లో స్నేహాలు, బంధాలకు చోటు లేదని వైసీపీ ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్