నా కోసం ట్రాఫిక్‌ ఆపొద్దు: చంద్రబాబు

80చూసినవారు
నా కోసం ట్రాఫిక్‌ ఆపొద్దు: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం రాత్రి ఢిల్లీ బయల్దేరారు. తన పర్యటన సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలపై పోలీసుల‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్‌ ఆపవద్దని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజా సేవకులుగా పోలీసులు మారాలని సూచించారు. వీఐపీ సెక్యూరిటీ పేరుతో కాన్వాయ్‌ వెళ్లే దారిలో గంటల తరబడి వాహనాలు నిలిపివేసే విధానాలకు స్వస్తి పలకాలని చంద్రబాబు నిర్ణయించారు.