కొంకుదురులో శ్రీదేవీ నవరాత్రులకు నాంది

83చూసినవారు
కొంకుదురులో శ్రీదేవీ నవరాత్రులకు నాంది
కొంకుదురు మూలటాపు వద్ధ వెలిసిన శ్రీ విజయ దుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు నాందిగా శుక్రవారం ఉదయం రాట మంచి చేశారు. అడపా పెద్ద, వీరలక్ష్మి భవాని దంపతులు కర్తలుగా అర్చకులు భాస్కర శర్మ పందిరి రాటకు పూజలు చేయించారు. ఉలపల్లి, కొంకుదురు, పైన గ్రామాలకు మూలటాపు కూడలి కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారని తదనుగుణంగా ఈ శరన్నవరాత్రుల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్