భారీ వర్షాలకు కూలిన పెంకుటిల్లు

65చూసినవారు
గోపాలపురం మండలంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో శిథిలావస్థకు చేరిన పలు ఇళ్లు కూలిపోతున్నాయి. గోపవరం గ్రామంలో మెకాని సుబ్బలక్ష్మికి చెందిన పెంకుటిల్లు సోమవారం కూలిపోయింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న ఆమెకు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు ఆమెను వెంటనే రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్