ఎన్నికల కమిషన్ సూచించిన విధంగా రాజకీయ పార్టీల నాయకులు, మీడియా ప్రతినిధులు ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఐ. సాయిబాబు సూచించారు. ఎన్నికల నిర్వహణలో రాజకీయ పార్టీల నాయకులు, మీడియా పాత్ర అనే అంశంపై మంగళవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద రాజకీయ పార్టీల నాయకులు, పాత్రికేయులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు.