ఏప్రిల్ 3వ తేదీ నుంచి పింఛన్ల పంపిణీ

1536చూసినవారు
ఏప్రిల్ 3వ తేదీ నుంచి పింఛన్ల పంపిణీ
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ మాధవి లత ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామ వార్డు సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేస్తారని, లబ్ధిదారులు ఆధార్ కార్డు, పింఛన్ పాస్‌పుస్తకం తీసుకొని రావాలన్నారు. ఎన్నికలు ప్రక్రియ పూర్తయ్యే వరకు సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్