పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చినరాజప్ప

53చూసినవారు
పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చినరాజప్ప
పేదల ముఖంలో నవ్వు చూడాలని, వారి ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కించాలని ఉద్దేశంతో సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నట్లు పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లును శనివారం పంపిణీ కార్యక్రమంలో రాజప్ప పాల్గొన్నారు. లబ్ధిదారుల అవసరతను తెలుసుకుని ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్