రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేట డి-బ్లాక్కు చెందిన 800 మంది టీడీపీ, జనసేన నాయకులు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తనయుడు చెల్లుబోయిన నరేన్ ఆధ్యర్వంలో ఆదివారం సాయంత్రం వైసీపీలో చేరారు. ఈ మేరకు వారందరికీ ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం నరేన్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నచ్చి వారు పార్టీలోకి చేరారన్నారు.