వరద బాధితులకు అండగా పంచాయతీరాజ్ అధికారులు

75చూసినవారు
విజయవాడ వరద బాధితులకు తూ. గో జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సిబ్బంది అండగా నిలిచారు. డీపీవో, రాజమండ్రి రూరల్, రాజానగరం ఎంపీడీవోలు, పంచాయతీ సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో 7, 500 వెజ్ బిర్యానీ ప్యాకెట్లను పంపించారు. హుకుంపేటలోని మండల పరిషత్ కార్యాలయం నుంచి గురువారం బయలుదేరిన ఈ ఆహార పొట్లాల వ్యాన్‌కు డీపీవో దాసరి రాంబాబు, ఎంపీడీవో డి. శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్