రామచంద్రాపురంలోమాల,మాదిగల ఆత్మీయ సమావేశం
రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో దళితుల భారీ బహిరంగ సభలో కూటమి బలపరిచిన స్థానిక నియోజకవర్గ టిడిపి ఎంఎల్ఎ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్, అమలాపురం ఎంపీ టిడిపి అభ్యర్థి హరీష్ మాధుర్ గురువారం పాల్గొన్నారు. తనపై లేనిపోని ఆరోపణలను చేసినవారు తన సవాలను స్వీకరించాలన్నారు. నిరాధారమైన ఆరో పణలు చేయడం తగదన్నారు. తాను మంచి వాడిని కాదని అనిపిస్తే ఓటు వేయొద్దని మీకు తెలిసిన వారందరినీ అడిగి ఓటు వేయాలని సుభాష్ అన్నారు.