5 రోజుల్లో 90 వేలమంది నిరాశ్రయులయ్యారు!

60చూసినవారు
5 రోజుల్లో 90 వేలమంది నిరాశ్రయులయ్యారు!
గత వారం నుంచి లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు ఉద్ధృతం చేసింది. ఈ నేపథ్యంలో స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని పలు సందర్భాల్లో ఇజ్రాయెల్‌ సూచించింది. ఈ క్రమంలోనే 5 రోజుల్లో దాదాపు 90 వేల మంది నిరాశ్రయులైనట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. మరోవైపు, రిజర్వ్ బ్రిగేడ్‌లను యాక్టివేట్‌ చేయడానికి ఇజ్రాయెల్ సైన్యం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లెబనాన్‌లో దాడులు మరింత తీవ్రతరమయ్యే అవకాశం కనిపిస్తోంది.

సంబంధిత పోస్ట్