రంపచోడవరం: అల్పపీడనంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

73చూసినవారు
రంపచోడవరం: అల్పపీడనంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రాబోయే అల్పపీడనంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష ఆదివారం సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో 14, 15, 16 తేదీల్లో విస్తారంగా వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో నియోజవర్గంలోని అన్ని మండలాల అధికారులు 24x7 అప్రమత్తంగా ఉండి అన్నీ ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్