అవయవ దానంతో హెచ్ఎం సుజాత సజీవం

59చూసినవారు
రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత తన అవయవాలను దానం చేశారు. మృతికి ముందే మరణానంతరం అవయవాలను దానం చేసేందుకు ఆమె అంగీకరించారు. కాకినాడలో గురువారం ఆంధ్రప్రదేశ్ జీవన్ ధాన్ సంస్థ ఆమె కళ్లు, గుండె, తదితర అవయవాలను తీసుకొని భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అవయవదానంతో ఆమె సజీవంగా నిలిచారని పలువురు కొనియాడారు.

సంబంధిత పోస్ట్