రాజోలు: రతన్ టాటాకు నివాళులర్పించిన కూటమి నాయకులు

67చూసినవారు
రాజోలు మండల కేంద్రం రాజోలులో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి పట్ల గురువారం ఎన్డీఏ కూటమి నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక రంగానికే కాకుండా, రతన్ టాటా చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్