సఖినేటిపల్లి రేవులో రాకపోకలు పునరుద్ధరణ

83చూసినవారు
సఖినేటిపల్లి రేవులో రాకపోకలు పునరుద్ధరణ
సఖినేటిపల్లి రేవులో పంటు రాకపోకలు సోమవారం నుంచి పునరుద్ధరణకు నోచుకున్నాయి. గోదావరి వరద కారణంగా 3 రోజుల క్రితం పంటు రాకపోకలు నిలిపివేశారు. గోదావరి వరద పూర్తిగా తగ్గడంతో రేవులో పంటు ద్వారా రాకపోకలను పునప్రారంభించారు. రేవులో రాకపోకలు నిలిపి వేయడంతో స్థానికులు మూడు రోజులు చించినాడ బ్రిడ్జి మీదుగా పశ్చిమగోదావరికి రాకపోకలు సాగించారు. రాకపోకలు పునరుద్ధరణ కావడంతో ఇబ్బందులు తొలగిపోయాయి.

సంబంధిత పోస్ట్