మద్యపాన రహిత సమాజం కోసం కృషి చేయాలి
మద్యపానరహిత సమాజం కోసం రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ ఎన్ సూర్యనారాయణ అన్నారు. గొల్లప్రోలులో మార్కెట్ సెంటర్ లో మద్యపానానికి వ్యతిరేకంగా పంచుతూ కరపత్రాలు శనివారం అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విచ్చలవిడిగా మద్యం గ్రామాలు, పట్టణాల్లో ఏరులై పారుతుందని దీన్ని ప్రజలందరూ నియంత్రించాలన్నారు.