May 09, 2024, 13:05 IST/నారాయణ్ పేట్
నారాయణ్ పేట్
మోడీ పర్యటనకు పటిష్ట పోలీస్ బందోబస్తు
May 09, 2024, 13:05 IST
రేపటి ప్రధాని మోడీ పర్యటనకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. 1000 మంది రాష్ట్ర పోలీసుల తోపాటు ఎన్ ఎస్ జి పోలీసులు విధుల్లో ఉంటారని చెప్పారు. గురువారం నారాయణపేట పట్టణంలో బందోబస్తుకు వచ్చిన పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కేటాయించిన స్థలాల్లో విధులను పకడ్బందీగా నిర్వహించాలని, నిర్లక్ష్యంగా ఉండరాదని చెప్పారు.