ఎన్నిక‌ల ఫ‌లితాలు.. 33 కేంద్రాల్లో కౌంటింగ్

57చూసినవారు
ఎన్నిక‌ల ఫ‌లితాలు.. 33 కేంద్రాల్లో కౌంటింగ్
AP: రాష్ట్రంలో ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. 33 కేంద్రాల్లోని 401 హాళ్లలో ఓట్ల లెక్కింపుకు ఈసీ ఏర్పాట్లు చేసింది. లెక్కింపు కోసం ఈసీ 25,209 మంది సిబ్బందిని వినియోగిస్తోంది. కౌంటింగ్‌ను పరిశీలించడానికి 119 మంది కేంద్ర అబ్జర్వర్లు ఏపీకి చేరుకున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 45,000 మంది పోలీస్ సిబ్బంది, 67 కంపెనీల సాయుధ బలగాలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి.