ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ భూభాగంలో చెత్త, వ్యర్థాలతో కూడిన వందల బెలూన్లను ఉత్తర కొరియా జారవిడవడాన్ని తీవ్రంగా పరిగణించిన దక్షిణ కొరియా ప్రతిచర్యలకు ఉపక్రమించింది. ఇందులోభాగంగా కిమ్ రాజ్యంతో చేసుకున్న మిలిటరీ ఒప్పందానికి మంగళం పాడనున్నట్లు పేర్కొంది. ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసం పునరుద్ధరణ జరిగేవరకు ‘సెప్టెంబర్ 19 మిలటరీ ఒప్పందం’ను నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది.