నూజివీడులో వ్యక్తిని ఢీకొన్న ఆటో

72చూసినవారు
నూజివీడులో వ్యక్తిని ఢీకొన్న ఆటో
నూజివీడు పట్టణంలోని అమెరికన్ ఆసుపత్రి సమీపంలో వేగంగా వచ్చిన గుర్తుతెలియని ఆటో నడుచుకుంటూ వెళ్లే వ్యక్తిని గురువారం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పట్టణానికి చెందిన తోట సురేశ్ (28)కు తీవ్ర గాయాల కావడంతో నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవలకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులు రిఫర్ చేశారు. వాహనాల వేగాన్ని నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్