నూజివీడులో రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు

53చూసినవారు
నూజివీడులో రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు
మండలంలోని మీర్జాపురం గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో మంగళవారం సాయంత్రం ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు వేగంగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులకు గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న ఏలూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు నిమ్మగడ్డ నరసింహ క్షతగాత్రులను ఆటోలో నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్