అంగన్వాడీలకు
టీడీపీ నేత, మాజీ మంత్రి పీతల సుజాత సంఘీభావం తెలిపారు. భీమవరంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం పిరికిపంద చర్యగా పరిగణించారు.
టీడీపీ హయాంలో అంగన్వాడీలకు 2 సార్లు జీతాలు పెంచామని.. తమ ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని సుజాత హామీ ఇచ్చారు.